Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 6:30 pm Posted by : ramakrishna

18న బీసీ బంద్ కు సహకరించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 18 తలపెట్టిన బీసీ బందుకు సహకరించాలని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇవ్వదల్చిన 42 శాతం రిజర్వేషన్లను కొందరు అగ్రవర్ణాల వారు కోర్టులో కేసి వేసి నిలిపివేశారని తెలిపారు. ఈనెల 18 రాష్ట్ర బంద్ కు సహకరించాలని నిజామాబాదులోని పలు సంస్థలను కలుసి వారి సహకారం కోరారు. నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ ని కలిసి వారి సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగ కిషన్, కరిపె రవీందర్, దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, బాలన్న, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.