బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన తీగల సాయిరెడ్డి వాళ్ళ అమ్మ గంగు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.