పనులు పరిశీలించిన సునీల్ రెడ్డి
బతుకమ్మ,మెండోరా:బాల్కొండ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శుక్రవారం మెండోరా మండల కేంద్రం లో జరుగుతున్న పలు పనులను బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి సునీల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆర్ అండ్ బి రోడ్డు, పక్కన డ్రైనేజీ పనులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో పూర్తి నాణ్యతతో నిర్మించాలని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.