Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 11:25 am Posted by : ramakrishna

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలిస్ స్టేషన్ లిమిట్స్ లోని నాగారంలో ఓక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నాగారం కు చెందిన ఆటో డ్రైవర్ సలీం (28) స్థానికంగా నిజాం సాగర్ కాలువ వద్ధ ఉన్న పట్టణ ప్రగతి పార్కులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 18 నెలల క్రితం భీంగల్ కు చెందిన యువతితో సలీంకు వివాహం జరిగిందని తరువాత కాలంలో కుటుంబ కలహలు, గోడవలు జరుగుతున్నట్టు తెలిసింది. సోమవారం  వరకు భీంగల్ లో ఉన్న సలీం ఎప్పుడు వచ్చి ఉరివేసుకున్నాడో తెలియదని కుటుంబ సభ్యులు పేర్కోన్నారు. ఈ మేరకు ఐదవ టౌన్ పోలిసులు కేసు నమోదు చేసి డేడ్ బాడిని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.