ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

బతుకమ్మ, మెండోరా: మండల కేంద్రమైన మెండోరా లో  కర్నె శంకర్ (30) ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నారాయణ సోమవారం తెలిపారు. శంకర్ మద్యానికి బానిసై భార్య మాధవితో తరచూ గొడవ పడుతూ  ఉండేవాడన్నారు. ఇంట్లో భార్యతో గొడవపడి బెడ్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. శవాన్ని  పోస్ట్ మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తునట్లు తెలిపారు.