బతుకమ్మ, మోర్తాడ్: గత సంవత్సరం నుండి మందుకు బానిసై జీవితం పై విరక్తి చెంది పాటిల్ దీపక్(30) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల దీపక్ అనే వ్యక్తి వృతి రీత్యా కూలి చేసుకునే వ్యక్తిని గుజరాత్ లోని సూరత్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం మోర్తాడ్ మండలంలో నివాసముంటున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం నుండి మందుకు బానిసై ఇంటికి రోజు తాగి వచ్చి అతని బార్యతో గొడవ పడేవాడు, రోజు మాదిరిగా సోమవారం రాత్రి 7.30 గంటలకు ఇంటికి తాగిరాగా ఇలా తగి వస్తే ఎలా అని అతని భార్య అడిగినందున ఆమెతో గొడవపడి ఇంటినుండి వెళ్ళిపోయినాడు అని మద్యంకు బానిసై జీవితంపై విరక్తి చెంది రాత్రి సమయంలో యానాం గల్లీలో టేకు చెట్టుకు ఊరి వేసుకొని చనిపోయినాడు అని అతని భార్య పాటిల్ రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి ధర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.