Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 8:26 pm Posted by : ramakrishna

వరద కాలువలో దూకి ఆత్మహత్య

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ గ్రామానికి  చెందిన కట్టేకొల్ల  గోపీనాథ్ (51) వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గత 12 సంవత్సరాల నుండి ఎడమ కాలు ఉన్న పుండుతో భాద పడుతున్నాడని, అతని కూతురు ప్రేమ వివాహం  చేసుకొని గోడవల కారణంగా  వీరి ఇంట్లోనే  ఉండడం వలన కట్టేకొల్ల  గోపీనాథ్ జీవితం పై  విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళి వరద కెనాల్ నందు దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అతని భార్య కట్టేకొల్ల మానస  యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు మోర్తాడ్ ఎస్‌ఐ తెలిపారు.