Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 7:11 pm Posted by : ramakrishna

పురుగుల మందు తాగి ఆత్మహత్య

బతుకమ్మ, ఏర్గట్ల :  తడపాకల్ గ్రామానికి చెందిన ఉతకం స్వామి గౌడ్ అనే వ్యక్తి భూవివాదాలపై సివిల్ కోర్టులో కేసులు పెండింగులో ఉండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈనెల 8 తేదీన రాత్రి ఇంటి నుంచి వెళ్లి మరల ఇంటికి రాకపోవడంతో స్వామిగౌడ్ కుటుంబ సభ్యులు బంధువులు వెతకడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతుండగా మంగళవారం గోదావరి నది వద్ద స్వామి గౌడ్ మృతదేహం కనబడడం జరిగిందని మృతుని బంధువులు తెలిపారు. వెంటనే విషయాన్ని ఏర్గట్ల పోలీస్ వారికి తెలపడం తో మృతుడు గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై పడాల రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి శవ పంచనామా అనంతరం స్వామి గౌడ్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.