Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 8:49 pm Posted by : ramakrishna

ఎమ్మార్వో ఆఫీస్ ముందు యువకుని ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన గడ్డమీది సందీప్ గౌడ్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు (29) ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో సందీప్ గౌడ్ వివాహం అవ్వగా ఫ్యామిలీ నుండి వేరే అయ్యారు. ఫ్యామిలీ రేషన్ కార్డు నుండి పేరును తొలగించి కొత్త రేషన్ కార్డు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసుకోగా తదుపరి కూడా మీ సేవలో కూడా అప్లై చేయగా ఇప్పటివరకు రేషన్ కార్డ్ రాకుండా నాయకులు అడ్డుకుంటున్నారని మనస్థాపం చెంది ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఎమ్మార్వో సందీప్ గౌడ్ దగ్గర పూర్తి వివరాలు తీసుకొని రేషన్ కార్డ్ వచ్చేలా ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు.