Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 3:45 pm Posted by : ramakrishna

జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు సుద్ధపల్లి విద్యార్థులు 

ఆర్మూర్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు సాత్విక సావిత్రి జాతీయస్థాయి అండర్ 17 ఎస్ జి ఎఫ్ సాఫ్ట్ బల్ పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ నలిని తెలిపారు. గత నెల ఆర్మూర్ నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్  పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి జట్టు విజయానికి మొదటి ప్రాధాన్యత పోషించారు  ఈనెల మహారాష్ట్ర 5 నుండి 9 వరకు జలగావ్ స్టేడియంలో  మహారాష్ట్రలో జరగబోయే 68 వ జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జోష్న తెలిపారు. ఈ విద్యార్థినులను జిల్లా ఎజిఎఫ్ సెక్రటరీ నాగమణి  సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి మరికంటి గంగా మోహన్ బేజ్ బాల్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్. మధుసూదన్ రెడ్డి అభినందించారు.