మీనాక్షి నటరాజన్ ను కలిసిన సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ : ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు ప్రభుత్వ సలహాదారు పదవి కేటాయించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.