Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 3:38 pm Posted by : ramakrishna

సుదర్శన్ రెడ్డికి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం

ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారుగా నియమితులై తొలిసారిగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుండడంతో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు టిపిసిసి కార్యదర్శి నాగేష్ రెడ్డి, తాహెర్ బీన్ హుందాన్,జిల్లా నాయకులు పూలమాలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు హోదాలో మొదటిసారి జిల్లాకు వస్తుండడంతో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Sudarshan Reddy gets a grand welcome at the toll plaza