Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 1:28 pm Posted by : ramakrishna

మాలల సింహగర్జనను విజయవంతం చేయండి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మాలల సింహగర్జను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారాం కోరారు. ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుంచి 200 బస్సులు, 300 కార్లలో డిసెంబర్ 1న ఉదయం 7గంటలకు హైదరాబాద్ కు తరలివెళ్తామని అన్నారు. సమావేశంలో కో కన్వీనర్ నీరడి లక్ష్మణ్, కామారెడ్డి జిల్లా చైర్మన్ బంగారు సాయిలు, భీమ్ రావు గైక్వాడ్, జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సక్కి విజయ్, రాజేందర్ మాల మహానాడు ప్రతినిధులు పాల్గొన్నారు.