మోర్తాడ్, బతుకమ్మ:భీమ్ గల్ లో జరుగుతున్నటువంటి లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామి జాతర కు శెట్ పల్లీ గ్రామం నుండి సుమారు 1200 మంది కి పైగా పోవడం జరుగుతుందని దీంతో గ్రామం లో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతూ మోర్తాడ్ పోలీస్ శాఖ వారికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంజాల నవీన్, గురిజాల నర్సయ్య, గంజాల నరేష్, ఎల్లుల్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.