సబ్‌ కలెక్టర్‌ కు వినతి పత్రం అందజేత

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు షాదీ ముబారక్‌ పథకం లబ్ధిదారులకు పెట్టిన నిబంధనలను స్థానిక మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల పేదలు నష్టపోతున్నారని సోమవారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అక్బర్‌, ఖాదర్‌, రహీం,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.