ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత

బతుకమ్మ,ముప్కాల్: మూడు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని ఎంపీడీవో నరేష్ ఆనంద్ కు ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ముప్కాల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలోని ఏడు గ్రామాలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ లకు గత మూడు నెలల నుండి  జీతాలు రాకపోవడం ఆర్థికంగా ఇబ్బంది ఉందని జీతాల డబ్బులు వచ్చేలా చూడాలని తెలియజేశారు. దీంతో స్పందించిన ఎంపీడీవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ శకుంతల, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మహేష్, విజయ తదితరులు...