ఆర్మూర్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం యొక్క ఆదేశానుసారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి సూచన మేరకు ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నందు బిజేపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన నిర్వహించినటువంటి జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి నిజామాబాద్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి సమక్షంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు.