Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 5:14 pm Posted by : ramakrishna

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్

మద్నూర్, బతుకమ్మ: ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల,  ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోనీ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి పరిశీలించారు. రెండు తరగతి గదులను పరిశీలించారు. ఒకటి పట్టభద్రుల ఓటర్ల కొరకు, మరోటి ఉపాధ్యాయ ఓటర్ల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలో ధరఖాస్తు చేసుకున్న ఓటర్లు పట్టభద్రుల ఓటర్లు 417 మంది,  ఉపాధ్యాయ ఓటర్లు 49 మంది  27న జరిగే పోలింగ్ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. సబ్ కలెక్టర్ గారి వెంట మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీవో వెంకట నర్సయ్య, గిర్ధవర్ ఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sub-Collector inspected the polling stations