Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 8:40 pm Posted by : ramakrishna

విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

 

. . . డి టి ఓ ఉమా మహేశ్వర్ రావు

 మాక్లూర్, బతుకమ్మ:

విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో కిలకమైన రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రవాణా శాఖాధికారి ఉమా మహేశ్వర్ రావు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు భాగంగా శనివారం మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద గత తెలంగాణ మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డి టి ఓ ఉమ మహేష్ శ్వరరావు, ఎంఏవిఐలు శ్రుతి, వాసుకీలతో పాటు ఈదార్ నుంచి వర్షలతో పాటు అధికారులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు. రోడ్డు దాటేటప్పుడు ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరుగకుండా దాటాని సూచించారు. యుక్త వయస్సు వచ్చిన వారు ఖచ్చితంగా ఓటరు ఐడి ఏవిధంగా కలిగి ఉంటారు లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలి అని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.

Students should be aware of road safety