విద్యార్థులకు మెంటల్ వెల్నెస్,  హెల్త్ పై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎన్.సి.సి.,  ఎన్.ఎస్.ఎస్.  ఆధ్వర్యంలో ఎన్.జి.ఓ. లయన్స్ క్లబ్ సంస్కృతి, హైదరాబాద్, ప్రభుత్వ  ఆరోగ్యశాఖ నిజామాబాద్  వారి సహకారంతో సోమవారం    విద్యార్థులకు, "మెంటల్ వెల్నెస్ & మెంటల్ హెల్త్  అవగాహన" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం కాపాడుకుంటేనే ఇంకా ఏదైనా సాధించగలమని, విద్యార్థులు మంచి జీవన శైలిని అలవర్చుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ రవితేజ, మానసిక వైద్య నిపుణులు మాట్లాడుతూ 'సెల్ ఫోన్' ...