బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ధర్నా
ఎల్లారెడ్డి, బతుకమ్మ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చేందుకు మోడల్ కళాశాల వద్ద బస్సులు ఆపడం లేదని ఇంటర్ హాస్టల్ విద్యార్థులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. తమ చదువుకు అంతరాయం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. డిపో మేనేజర్ స్పందించి బస్సు డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులను కండక్టర్ కిందికి దించేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.