Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 8:43 pm Posted by : ramakrishna

చెట్ల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన

భీంగల్‌, బతుకమ్మ :

 

వాతావరణం పరిరక్షణ లో భాగంగా చెట్ల సంరక్షణ పై అవగాహన పెంపొందించేందుకే మదర్ ట్రీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్. సతీష్ అన్నారు. శనివారం భీంగల్ డిగ్రీ కళాశాల లో కమిషనరేట్ అఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యుయేషన్ సూచనలు అనుసరించి మదర్ ట్రీ ( మాతృ వృక్షం ) కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో కానుగ వృక్షం ఎంపిక చేసి వృక్షానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు శంకర్, తదితరులు పాల్గొన్నారు.