బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ధర్మతేజ 5000 రూపాయలు, స్థానిక ఎస్సై మహేందర్ 5000 రూపాయలు ఆర్థిక సాయంగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిగా ధర్మతేజ, సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్, రామసాని భూమయ్య, మెక్క రమేష్, తదితరులు పాల్గొన్నారు.