చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రాజశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రాజశ్రీ హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం డిఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్...