పరిహారం త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రాజంపేట, బతుకమ్మ : పంట నష్టం వివరాలను త్వరగా సేకరించి బాధిత రైతులకు త్వరగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ రాజంపేట మండలంలో పర్యటించారు. జిల్లాలో వరుసగా కురిసిన వర్షాల ప్రభావంతో రాజంపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యాప్తంగా పంట నష్టం వివరాలను త్వరగా సేకరించి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని...