Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 8:16 pm Posted by : ramakrishna

పలు కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు ఎల్లారెడ్డిపేట మండలంలో సోమవారం పర్యటించారు. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ వార్డు సభ్యుడు పందిర్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి తన కుమారుడిని ఎత్తుకొని పలకరించారు. అనంతరం రాజన్నపేట గ్రామానికి చెందిన పాతూరి భూపాల్ రెడ్డి తల్లి ఇటీవల మరణించగా రాజన్నపేట గ్రామంలోని తన నివాసంలో భూపాల్ రెడ్డిని పరామర్శించారు. తనతోపాటు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

State PCC spokesperson visits several families