వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక రామాలయంలో ఆయన పట్టణ నాయకులు, కార్యకర్తలతొ కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మండల అధ్యక్షుడు ఎలేటి రమేష్ రెడ్డి, బద్దం రాజారెడ్డి, శివపాల్, రమేష్, రవి, రమేష్, కిషన్, సచిన్, గంగాధర్, నరసయ్య, శ్రీకాంత్, అన్వేష్, రంజిత్, రాజేందర్, రమేష్, శ్రీనివాస్, శేఖర్, ప్రతాప్ మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
