నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించనున్నారని స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు ఏ గోపి తెలిపారు. పోటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎస్ సి రాపల్లి రవీందర్ సభా అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్ ఈ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్, ఎస్ సి ఓ ఎం సి పివి రావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని డివిజన్ ఇంజనీర్లు ,సీనియర్ అకౌంట్ ఆఫీసర్స్ హాజరవుతారని అన్నారు. నిజాంబాద్ జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఎంప్లాయిస్ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
