Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 4:34 pm Posted by : ramakrishna

రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, బతుకమ్మ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు. అనంతరం కల్యాణ మండపంలో వేదపండితుల చేతుల మీదుగా వేదోక్త ఆశీర్వాదాలు పొందారు.  భక్తులు, అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధి విషయాలపై చర్చించారు.

State government whip Adi Srinivas visits Rajanna