Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 10:31 pm Posted by : ramakrishna

భిక్కనూరు వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన రాష్ట్ర కమిషనర్

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు వ్యవసాయ మార్కెట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాత్రి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ధాన్యపు కొనుగోలను వేగవంతం చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

State Commissioner visited Bhikkanur Agricultural Market

రైతులు పంటను ముందే కోయడం వల్ల నాణ్యత లేకుండా పోతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరి  కొనుగోలు విషయంలో మన రాష్ట్ర ధాన్యన్నీ బీహార్ తమిళనాడు రాష్ట్రాలకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. వడ్లు నాణ్యత లేవని అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రైతులు నేరుగా మార్కెట్లోకి తీసుకురావాలని తెలియజేశారు.

State Commissioner visited Bhikkanur Agricultural MarketState Commissioner visited Bhikkanur Agricultural Market