. . . ఐదుగురు మృతి
. . . పలువురికి గాయాలు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
ఆర్ సీబి గెలిచిన విక్టరీ వేడుకలు బెంగళూరులో విషాదానికి దారితీసాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుదవారం సీఎం, గవర్నర్, మంత్రుల సమక్షంలో ఆర్సీబి విక్టరీ పరేడ్ జరిగింది. స్టేడియంలోకి క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారు. భారీకేడ్లు దూకి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. క్రికెట్ అభిమానులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. తొక్కిసలాటలో దాదాపు ఐదుగురు మృత్యువాత పడగా చాలా మంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
