నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : బుధవారం ప్రకటించిన ఎస్సస్సీ పరీక్ష ఫలితాలలో సెయింట్ జేవియర్ పాఠశాలలో 600 మార్కుల గాను సాత్విక 581 మార్కులు సాధించిందని పాఠశాల ప్రిన్సిపాల్ లతా గౌడ్ తెలిపారు. తమ పాఠశాలలో సిహెచ్. మనోజ్ఞ 560, బి.శృతిక 558, టీ.మధురిమ 538, ఎల్.అంజనా 528, పి.వాదశ్రీ 513, పి.హరీష్ 512 మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని తెలిపారు. విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నానని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.