మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్పెల్ వే గేట్ల వద్ద అనిల్ అనే వ్యక్తి గల్లంతయ్యాడని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండలం పోచంపాడ్ లో శనివారం సాయంత్రం 4 గంటల సమయం లో కాల్వ గ్రామం దిలావర్పూర్ మండలం కి చెందిన ఆనంద్, అనిల్ అనే సోదరులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యాం కి చేపలు పట్టడానికి వచ్చి స్పిల్ వే గేట్స్ వద్దకు చేరుకుని చేపలు పడుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి ఇద్దరు నీటిలో మునిగిపోగా ఆనంద్ నీటిలో నుండి బయటికి రాగా, అనీల్ నీటిలోనే గల్లంతయ్యాడని పేర్కొన్నారు. గల్లంతయిన వ్యక్తి కోసం గోదావరిలో గాలించినా అతని ఆచూకీ దొరకలేదు, గల్లంతయిన వ్యక్తి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలియజేశారు.