రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ విక్రయాలు

తిరుమల, బతుకమ్మ : అక్షయ తృతీయ సందర్భంగా రికార్డుస్థాయిలో తిరుమల శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జరిగాయి. బుధవారం రూ.90 లక్షల విలువైన బంగార డాలర్లను టీటీడీ విక్రయించింది. గతేడాది రూ.75 లక్షల బంగారం డాలర్ల విక్రయాలు జరిగాయి. టీటీడీ భక్తుల కోసం శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచుతంది. అక్షయ తృతీయ సందర్భంగా  బంగారు డాలర్లు అధికంగా అమ్ముడయ్యాయి.ఈడాలర్ల రేటు బంగారం ధరతో పాటు మారుతు ఉంటుంది. అయితే రోజు కాకుండా ప్రతి బుధవారం టీటీడీ రేట్లను నిర్ణయిస్తుంది.