Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2025, 12:22 pm Posted by : ramakrishna

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటేండేంట్ గా శ్రీనివాస్ భాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటేండేంట్ గా ఫ్రో. డాక్టర్ పి శ్రీనివాస్ భాధ్యతలు స్వీకరించారు. జిజిహెచ్ లో మంగళవారం ఉదయం ఇంచార్జీ సూపరింటేండేంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ నుంచి డా శ్రీనివాస్ భాధ్యతలు స్వీకరించారు. జిజిహెచ్ ఇంచార్జీ సూపరింటేండేంట్ గా ఉన్న ప్రతిమారాజ్ ను తోలిగించి అక్కడే పిల్లల వైధ్య నిపుణులుగా ఉన్న శ్రీనివాస్ ను ఇంచార్జీగా నియమిస్తు సోమవారం వైధ్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిజిహెచ్ సూపరింటేండేంట్ గా భాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను ప్రోఫేసర్లు, వైద్యులు, జూడాలు, ఆసుపత్రి సిబ్బంది  పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

Srinivas assumes charge as Superintendent of Nizamabad District Hospital