- నాలుగవ రోజు అంగరంగ వైభవంగా శ్రీవారి ఊరేగింపు
భీమ్ గల్, బతుకమ్మ : శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి జయంతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైశాఖ శుద్ధ నవమిన స్వామి వారిని శేష వాహనం పై ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన మంగళవారం ఉదయం గ్రామాలయంలో అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను శేష వాహనం పైన ఉంచి జయ నరసింహ, జయ నర్సింహా జయజయ ధ్వనుల మధ్య గ్రామాలయ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.ఈ సందర్బంగా భక్తులకు అర్చకులు హారతినిచ్చి, తీర్థ ప్రసాదలను అందజేశారు.
