Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2024, 6:35 pm Posted by : ramakrishna

ఇందూర్ తిరుమలకు ఆవును సమర్పించిన సినీ గేయరచయిత శ్రీ రామజోగయ్య శాస్త్రీ 

 బతుకమ్మ, మోపాల్:

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలని నర్సింగపల్లి ఇందూరు తిరుమల ఆలయానికి ప్రముఖ సినీ గేయరచయిత శ్రీ రామజోగయ్య శాస్త్రీ ఆవును సమర్పించారు. శనివారం ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో ఉన్న గోశాలకు ప్రముఖ సినీ గేయరచయిత శ్రీ రామ జోగయ్య శాస్త్రీ గోదానం చేసారని ఆలయ ప్రధాన ధర్మకర్త నరేసిహ రెడ్డి తెలిపారు. అదే విధంగా ఆలయం కేంద్రంగా చేస్తున్న ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యాన్ని చూడడానికి త్వరలో శ్రీ రామజోగయ్య శాస్త్రీ ఇందూరు తిరుమలను దర్శనం చేసుకుంటారని తెలిపారు.ఒకప్పుడు ఆలయాలు కేంద్రం జ్ఞానాన్ని వివిధ రకాల సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు విరాజిల్లేవని ఇప్పుడు ఇందూరు తిరుమల ఆలయం కూడా అదే కోవలో సేవలు చేయడం గొప్ప విషయమన్నారు.