ఘనంగా శ్రీ రామనవమి శోభాయాత్ర

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్బంగా గ్రామంలోని హనుమాన్ మందిరంలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.అనంతరం మాల ధరించిన స్వాములందరు గ్రామస్తులతో కలిసి,శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హనుమాన్ మాలదారులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.