Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 7:03 pm Posted by : ramakrishna

గాలిపటాల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

  • చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాలిపటాల దుకాణాలను ఏఎస్ఐ జగదీష్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మితిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఏఎస్ఐ మండల ప్రజలు ఎవరు కూడా గాలిపటాలు ఎగురవేసేటప్పుడు కాటన్ దారాలను మాత్రమే వాడాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల చైనా మంజును వాడరాదని ఎవరైనా చైనా మాంజను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మాంజను ఎవరైనా అమ్మితే ప్రజలు తమకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సదానంద అశోక్ రాజా గౌడ్ లు ఉన్నారు.

Spot inspection of kite shops