డిచ్ పల్లి, బతుకమ్మ : జడ్పీ హెచ్ఎస్ డిచ్ పల్లి పాఠశాలకు రూ.60వేల విలువ గల క్రీడా పరికరాలను (హాకీ వాలీబాల్ కిట్) ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి వితరణ చేశారు.ఈ రోజు క్రీడా పరికరాలను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బి.సీతయ్య, సి.ఐ వినోద్, ఎస్.ఐ శేరిఫ్ ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, గ్రామ పెద్దలు భూస సుదర్శన్,నర్సారెడ్డి,యాదగిరి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
