నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని జడ్పీహెచ్ఎస్ బోర్గాన్ (పి) లో గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం 2006 – 2007 బ్యాచ్ 18 సంవత్సరాల తర్వాత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ తాము చేసిన తప్పు ఒప్పులను గుర్తించి నేడు మేము గొప్ప స్థానంలో ఉన్నాం అని గుర్తు చేశారు. గురువులు మాట్లాడుతూ విద్యా అనేది మీ జీవితంలో వెలుగు నింపుతుంది.. అజ్ఞానంలో ఉన్న వారిని ఙ్ఞానం వైపు నడిపిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు గంగారెడ్డి,వెంకట రమణ,రాములు, మోహన్ ప్రశాంత్ రెడ్డి, కిరన్ గౌడ్, రవి కిరణ్, విజయ లక్ష్మీ,పద్మావతి,మధుమతి తదితరులు పాల్గొన్నారు.