ప్రత్యేక ఉపాధ్యాయుల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా ప్రత్యేక ఉపాధ్యాయుల అసోసియేషన్ (ఎస్ఈటీఏ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు శనివారం తెలిపారు. ఎస్ఈటీఏ జిల్లా అధ్యక్షుడిగా ఎల్.జయరాం నాయక్, ప్రధాన కార్యదర్శిగా టీ.విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ విశ్వనాథ్, కార్యదర్శిగా బీ.ఉదయ్ కుమార్, సహాయ కార్యదర్శి, డాక్టర్ రేణుక, కోశాధికారిగా ఎం.మురళి, కార్యవర్గ సభ్యులుగా కే.రామకృష్ణ, ఎస్ఏ.ప్రియ వాణి, కే.గౌతమి, పీ.రజిత, బీ.మధుకర్ సేన, ఎన్.మానస, జీ.గంగామణి, హెచ్.వినీలను ఎన్నుకున్నామన్నారు. నూతన కార్యవర్గాన్ని ప్రత్యేక ఉపాధ్యాయులు అభినందించారు.