Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2024, 4:40 pm Posted by : ramakrishna

వరద నీరును తొలగించేలా అధికారుల ప్రత్యేక చర్యలు

  • క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సోమవారం మధ్యాహ్నం నుంచి నిజామాబాద్ నగరంలో కుండపోతుగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తమ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎల్లమ్మ గుట్ట కంటేశ్వర్ మధ్యలో ఉన్నరైల్వే ఆర్ఓబి వంతెన కింద దాదాపుగా రెండు మూడు గంటల పాటు భారీగా ఏడతెరిపు లేకుండా వర్షం కురవడంతో వెంటనే కింద వర్షపు నీరు భారీ మొత్తంలో వచ్చి చేరింది. అయితే అటు నుండి వస్తున్న ఓ బస్సు వర్షపు వరద మీరు దాటికి బస్సు సగం వరకు మునిగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో బస్సు దిగి బిక్కుబిక్కుమంటూ పానాలను కాపాడుకునేలా వరద నీటిలో దిగి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. భారీ వర్షానికి ఆర్ఓబి వంతెన కిందికి వచ్చిన వరద నీరును పరిశీలించడానికి మున్సిపల్ కమిషనర మంద మకరంద ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెడ్డవద్దని ఆర్ఓబి వద్ద ఉన్న నీరు ఎప్పటికప్పుడు డ్రైనేజీలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Special measures taken by the authorities to remove the flood water