ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కొడుకు

= తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆస్తి కోసం కన్నతల్లిని ఓ కసాయి కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విల్లాస్ లో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన  కార్తీక్ రెడ్డి (26) ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈక్రమంలో తల్లి రాధిక (52)పై కత్తితో దాడి చేసి కార్తీక్ రెడ్డి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.