Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 1:06 pm Posted by : ramakrishna

యువకుడిపై స్నేక్ గ్యాంగ్ అటాక్

. . . కత్తితో చంపుతామని బేదిరింపు

. . . గాయాలతో ఆసుపత్రిలో చెరిన యువకుడు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో యువకుడిపై స్నేక్ గ్యాంగ్ అటాక్ చేసింది. తన అనుమతి లేకుండా గల్లిలో తిరగవద్ధు  అని పాతకక్షలతొ యువకుడిపై స్నేక్ గ్యాంగ్ లీడర్, మరి కోంతమంది కత్తి తీసి చంపుతా అని బేదిరించి దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడి పారిపోయి ప్రాణాలతో బతికి బయటపడ్డారు. యువకుడి తండ్రి పిర్యాదు మేరకు ఓకటవ టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి హబిబ్ నగర్ లో జరిగింది. నగరంలోని హబిబ్ నగర్ కు చెందిన యాసీన్ పాషా  స్థానిక ఓక ప్రైవేట్ ఓకేషనల్ కాలేజీలో చదువుతున్నాడు. మంగళవారం రాత్రి  స్నేక్ నోమాన్ మరో నలుగురు యాసీన్ పాషాను అడ్డుకున్నారు. అతనిని కత్తితో బేదిరించి దాడి చేశారు. యువకుడిని తల్లిధండ్రులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. యువకుడి తండ్రి పోలిస్ లకు పిర్యాదు చేశారు.