Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 8:38 pm Posted by : ramakrishna

ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్ లకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాకు ఎంపిక చేస్తూ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి శెట్టి వెంకట శ్రీనివాస్ రావు(1995), స్వాతి లక్రా (1995), మహేష్ మురళీధర్ భగవత్ (1995), చారు సిన్హా (1996), అనిల్ కుమార్ (1996), వీసీ సజ్జనార్ (1996) లకు పదోన్నతి కల్పించినట్టు తెలిపారు. పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ అధికారులందరూ తమ ప్రస్తుత పోస్టులలోనే కొనసాగుతారని పేర్కొన్నారు.

 

Six IPS officers promoted to DGPs