కోర్టు భవన నిర్మాణానికి స్థల పరీశీలన

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి కోర్టు మంజూరైనా దరిమీల సోమవారం మండల అధికారులు స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ లు పట్టణం లోని పలు ప్రభుత్వ భవనాలు, స్థలాలను పరిశీంచారు. ఇందులో పాత ఎంపీడీఓ కార్యాలయం, పీయర్టీయు భవనం,ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లను పరిశీలించారు.అందులో కోర్టు భవనానికి ఆణువగా ఉన్నాయో లేవో పరిశీలించారు.వెంట ఎం ఈ ఓ స్వామీ ఉన్నారు.