Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 4:40 pm Posted by : ramakrishna

తమ్ముడు మరణవార్త విని అక్క గుండెపోటుతో మృతి

 

… గంటల వ్యవధిలో అక్క తమ్ముడి మృతి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

తమ్ముడు చనిపోయాడని విషయం తెలిసిన అక్క  గుండెపోటుతో మృతి చెందింది..  ఈ సంఘటన సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలో కోజా కాలనీలో చోటు చేసుకుంది… కాలనీకి చెందిన మహ్మద్ చౌస్ (25) బోధన్ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి వైన్స్  ముందు పడి చనిపోయారు.. ఈ విషయం తెలిసి అతని సోదరి ఫర్విన్ బేగమ్ (27) ఇంటి వద్దే గుండెపోటుతో చనిపోయింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. అతిగా మద్యం సేవించడం వలన మహమ్మద్ చౌస్ మరణించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…  ఫరీన్ బేగం కు ఇదివరకు వివాహం జరిగి పిల్లలు ఉండగా… చౌస్ అవివాహితుడు.. గంటల వ్యవధిలో అక్క, తమ్ముడు చనిపోవడం తో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.