Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 12:43 pm Posted by : ramakrishna

 నీటమునిగిన సిర్నపల్లి బ్రిడ్జి 

నిలిచిన రాకపోకలు

ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్న పల్లి గ్రామ శివారులోని  బ్రిడ్జి నీటితో మునిగిపోయింది.దీంతో అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శి,  గ్రామస్తులు ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు,గ్రామస్తులు సూచించారు.వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు బయటకు రావొద్దని  కోరారు.అత్యవసర పరిస్థితుల ఉంటే వేరే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sirnapalli Bridge submerged in water