. . . ఆర్టీసీ బస్టాండ్ ఫ్లాట్ ఫాం పై ఆగని బస్సులు !
. . . ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం ఫ్లాట్ ఫాం పై బస్సులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బస్సులను లోపలికి తీసుకెళ్లి ఆపాల్సి ఉండగా, డ్రైవర్లు ప్రధాన రహదారిపైనే నిలిపి వేస్తున్నారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డుపైకే పరుగులు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.